LIVE
AP Budget 2026-27: Record ₹3.2 lakh Cr allocation  •  PM Modi inaugurates Polavaram Phase 2  •  AP records highest-ever FDI inflow  •  Vizag Airport expansion gets ₹800 Cr  • 
AndhraPravasi
AndhraPravasi
ఆంధ్రప్రవాసి
⚡ BREAKING
AP Budget 2026-27: Record ₹3.2 lakh Cr allocation  •  PM Modi inaugurates Polavaram Phase 2  •  AP records highest-ever FDI inflow  •  Vizag Airport expansion gets ₹800 Cr  • 
Gulf

Donald Trump: ఇస్లామాబాద్‌ వేదికగా ప్రపంచశాంతి చర్చలు.. ఇరాన్‌తో ఒప్పందం కోసం ట్రంప్ భారీ ప్లాన్!

"జేడీ వాన్స్ టూ పాకిస్థాన్": చర్చలను ముందుండి నడిపిస్తున్న అమెరికా ఉపాధ్యక్షుడు.. ట్రంప్ రాకకు రంగం సిద్ధం.. "యుద్ధమా.. శాంతినా?": పాకిస్థాన్ మధ్యవర్తిత్వం

admin 1 min read Updated 2026-04-21 17:38:47
Donald Trump: ఇస్లామాబాద్‌ వేదికగా ప్రపంచశాంతి చర్చలు.. ఇరాన్‌తో ఒప్పందం కోసం ట్రంప్ భారీ ప్లాన్!
Key Points
  • "జేడీ వాన్స్ టూ పాకిస్థాన్": చర్చలను ముందుండి నడిపిస్తున్న అమెరికా ఉపాధ్యక్షుడు..
  • ట్రంప్ రాకకు రంగం సిద్ధం.. "యుద్ధమా..
  • శాంతినా?": పాకిస్థాన్ మధ్యవర్తిత్వం

"జేడీ వాన్స్ టూ పాకిస్థాన్": చర్చలను ముందుండి నడిపిస్తున్న అమెరికా ఉపాధ్యక్షుడు.. ట్రంప్ రాకకు రంగం సిద్ధం.. "యుద్ధమా.. శాంతినా?": పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ట్రంప్-ఇరాన్ ప్రతినిధుల కీలక భేటీ..Donald Trump: అంతర్జాతీయ దౌత్య ముఖచిత్రంలో పెను మార్పులకు నాంది పలుకుతూ అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలకు వేదిక సిద్ధమైంది. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఇస్లామాబాద్‌లో ఈ వారం జరగనున్న ఈ చర్చలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. ఇరు దేశాల మధ్య కుదిరిన రెండు వారాల తాత్కాలిక కాల్పుల విరమణ గడువు బుధవారంతో ముగియనున్న తరుణంలో, ఒకవేళ ఇస్లామాబాద్ వేదికగా ఏదైనా ఒప్పందం కుదిరితే, దానిపై సంతకం చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా రావడం లేదా వర్చువల్‌గా పాల్గొనడం జరగవచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ గడువును పొడిగించే ప్రసక్తే లేదని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించడంతో, ఈ చర్చలు అత్యంత నిర్ణయాత్మకంగా మారాయి.ఈ చర్చలకు ఇరాన్ హాజరవుతుందా లేదా అన్న అంశంపై ఇప్పటికీ కొంత సందిగ్ధత కొనసాగుతున్నప్పటికీ, తాజాగా టెహ్రాన్ వర్గాల నుంచి సానుకూల సంకేతాలు అందుతున్నాయి. హర్మూజ్ జలసంధిలో తమ నౌకను అమెరికా స్వాధీనం చేసుకోవడాన్ని నిరసిస్తూ చర్చల నుంచి తప్పుకుంటున్నట్లు ఇరాన్ మొదట ప్రకటించినా, తాజా పరిణామాల నేపథ్యంలో తమ నిర్ణయాన్ని పునఃసమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చర్చలు సజావుగా సాగుతాయని ధీమా వ్యక్తం చేస్తున్న అమెరికా, ఇప్పటికే తన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను మంగళవారమే పాకిస్థాన్‌కు పంపించేలా ఏర్పాట్లు చేసింది. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలన్న అంతర్జాతీయ ఒత్తిడి కూడా ఇందుకు ఒక కారణంగా కనిపిస్తోంది.అయితే, ఈ చర్చల విజయం ఇరు దేశాలు విధిస్తున్న కఠిన షరతులపైనే ఆధారపడి ఉంది. ఇరాన్ తన అణ్వాయుధ కార్యక్రమాన్ని పూర్తిగా పక్కన పెట్టాలని ట్రంప్ గట్టిగా పట్టుబడుతుండగా, తమపై ఉన్న ఆర్థిక ఆంక్షలను ఎత్తివేస్తేనే శాంతి సాధ్యమని ఇరాన్ స్పష్టం చేస్తోంది. చర్చలు గనుక విఫలమైతే తీవ్రమైన సైనిక దాడులు తప్పవని ఇరు పక్షాలు పరస్పరం హెచ్చరించుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒకవేళ యుద్ధం అంటూ వస్తే ఇరాన్‌లోని కీలక మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామని ట్రంప్ పేర్కొనగా, అమెరికా చర్యలకు గల్ఫ్ ప్రాంతంలోని ఇంధన కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ ప్రతిసవాల్ విసిరింది. ఈ నేపథ్యంలో, సుమారు 20,000 మంది భద్రతా సిబ్బంది పహారాలో ఇస్లామాబాద్ ఒక కోటలా మారిపోయింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరియు శాంతిపై ప్రభావం చూపే ఈ కీలక పరిణామం ఏ మలుపు తిరుగుతుందో అని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

57 readers have reacted

More Coverage

Revanth Reddy: గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి అండగా నిలిచిన సీఎం రేవంత్ రెడ్డి...  రూ. 5 లక్షల ఆర్థిక సాయం!

Revanth Reddy: గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి అండగా నిలిచిన సీఎం రేవంత్ రెడ్డి... రూ. 5 లక్షల ఆర్థిక సాయం!

Helping Hand- గల్ఫ్ బాధితుడికి ప్రత్యేక పద్ధతిలో ఆర్థిక సాయం…కోమాలో స్వదేశానికి వచ్చి మరణించిన కార్మ…